*రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!*
శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్ లో మెగా ఫిలిమ్స్ మరియు సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మితమవుతున్న చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ ’ .... ‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను ప్రముఖ రచయిత, రాజ్యసభ్య సభ్యులు
వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు, ఈ చిత్రం విజయం సాధించాలని ఆయన అన్నారు.
ఫస్ట్ బెంచ్లో మొదలైన ప్రేమ… చివరికి వారి జీవితాలనే మార్చిన కథ.... ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక విద్యా విధానంలో ర్యాంకుల కోసం పోటీ, యువతి, యువకుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు… ఈ gen - z తరం క్షణిక ఆనందాలు, భావోద్వేగాలు, తొలి ప్రేమ మరోవైపు...
ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య మొదలైన ఈ ప్రేమ, వారి చదువు, భవిష్యత్తు, కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన అలజడి ఎక్కడికి దారితీసింది అనే ఎమోషనల్ జర్నీ.
ప్రతి ఒక్కరి కాలేజ్ రోజులను, వారి తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే… యువత ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం మధ్య జరిగే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా చూపించే చిత్రం, అదే “ఫస్ట్ బెంచ్ ప్రేమకథ”
ఈ చిత్రానికి కొల్లబత్తిన జోష్న రాణి, నక్క హరిబాబు, కె రమేష్ చంద్ర నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శివకోటి బాబి, పఠాన్ వలీఖాన్, కాకరపల్లి రాజు.
TF
TeluguFilm.info
తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ
▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం
హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి పోటీలో మోహన్ వడ్లపట్ల సాధించిన భారీ విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనపై నిర్మాతల సమస్యల పరిష్కారం, పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది.
NRIగా మోహన్ వడ్లపట్లకు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు
మోహన్ వడ్లపట్ల NRIగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దర్శకుడు, నిర్మాతగా ఆయన పలు వైవిధ్యమైన చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సైకాలజికల్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive For Murder) అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది.
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకో-కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం విడుదలకు ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం 15కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
‘M4M-2’ సీక్వెల్ ప్రకటన
‘M4M’ అమెరికాలో విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2026లో శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో చిత్ర బృందం అధికారిక సీక్వెల్ను ప్రకటించింది. ‘M4M-2: Killer Games’ పేరుతో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఇందులోనూ మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ కలిసి పనిచేయనున్నారు.
OTTలోనూ ‘M4M’కు ఆదరణ
థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం ‘M4M’ చిత్రం జూన్ 19, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. Lionsgate Play, Amazon Prime Video వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఈ చిత్రం OTT ప్రేక్షకులను అలరిస్తోంది.
నిర్మాతగా పలు వైవిధ్యమైన చిత్రాలు
మోహన్ వడ్లపట్ల తన సొంత బ్యానర్ *‘మోహన్ మీడియా క్రియేషన్స్’*పై పలు తెలుగు చిత్రాలను నిర్మించారు.
‘మల్లెపూవు’ (2008): భూమిక చావ్లా, మురళీ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం.
‘మెంటల్ కృష్ణ’ (2009): నటుడు సత్యం రాజేష్ హీరోగా, శ్రీహరి ముఖ్య పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం.
‘కలవరమాయే మదిలో’ (2009): కలర్స్ స్వాతి, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించగా, సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం.
నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మోహన్ వడ్లపట్ల తాజాగా తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో, నిర్మాతల సమస్యలు, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
TF
TeluguFilm.info
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సిఏం జి.పరమేశ్వర రావు గారి ఆత్మీయ మిత్రుడు ఖాదర్ బాషా పాల్గొన్నారు.
కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత, భార్గవ గొట్టిముక్కల దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ స్టార్ ఎల్.ఎమ్ ప్రేమ్
తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్.
తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ పిచ్చారాగాడి మణి, లిరిక్: శ్రీరామ్ తపస్వి, మేకప్: నగేష్, సింగర్: వినాయక్. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన టీజర్, ట్రైలర్, రాబోతున్నాయి.